ఏపీలోని విశాఖ నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైల్వే జోన్ భూముల గురించి జీవీఎంసీ ముట్టడికి
బీజేపీ నేతలు యత్నించారు. పోలీసులకు ఆందోళన కారులకు తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనలో ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో పోలీసులు పలువురు
బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.