పొరపాటున ఉరి బిగుసుకుని తండ్రి కన్నుమూత

527చూసినవారు
పొరపాటున ఉరి బిగుసుకుని తండ్రి కన్నుమూత
పొరపాటున ఉరి బిగుసుకుని తండ్రి కన్నుమూసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన చందన్‌కుమార్‌(33) రైల్వేలో సీనియర్‌ అసిస్టెంట్ లోకో పైలట్‌. కొత్తపాలెంలోని నివాసంలో బుధవారం రాత్రి కుమార్తె(7), కుమారుడు(5) ఆయన చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించేశారు. పిల్లలపై చిరాకు పడితే భార్య అడ్డుపడింది. దీంతో ఇంట్లోని ఫ్యాన్‌ హుక్‌కు చీర కట్టి, దాన్ని మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకుని చనిపోయాడు.

సంబంధిత పోస్ట్