ఏపీలో అసెంబ్లీ
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం
జగన్ అభ్యర్థులను మారుస్తూ జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో భంగపడ్డ అభ్యర్థులు తమ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు లిస్టులను విడుదల చేసిన
వైసీపీ ఐదో జాబితా విడుదలకు సిద్ధమవుతుంది. టికెట్లు రానివాళ్లు ఈ మార్పులపై మండిపడుతున్నారు.