AP: టీడీపీ కార్యకర్తలకు అసలైన గుర్తింపు సభ్యత్వ కార్డులేనని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలకు ఆయన సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "మండల, గ్రామ నేతలు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ కార్డులు పంపిణీ చేయాలి. పీ-4 విధానం పేదల ఆర్థిక బలోపేతానికి దోహదం చేస్తుంది. పీ-4తో తలసరి ఆదాయం పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం” అన్నారు.