రాబోయే 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

57చూసినవారు
రాబోయే 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు
AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ప‌లు చోట్ల వ‌ర్షాలు కురుస్తాయ‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. రేపు అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

సంబంధిత పోస్ట్