చిన్నారి మిస్సింగ్ ఘటనపై స్పందించిన ఎస్పీ

81చూసినవారు
పుంగనూరులో చిన్నారి అస్ఫియా మిస్సింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నారి ఆచూకీ కోసం 11 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అంతేకాకుండా డాగ్ స్క్వాడ్ పసిగట్టిన ప్రదేశాలను సందర్శించి పలు వివరాలను సేకరించామని ఎస్పీ తెలియజేశారు. త్వరలోనే అస్ఫియా ఆచూకీని కనిపెడతామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్