నియోజవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ సూచనలతో గూడూరు టీడీపీ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు కరీముల్లా, పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం మహిళల శ్రేయస్సు కోసం బాబు మళ్లీ రావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి మహిళలకు సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, మహిళలు పాల్గొన్నారు.