బాలిరెడ్డి పాలెంలో న్యాయ విజ్ఞాన సదస్సు

52చూసినవారు
బాలిరెడ్డి పాలెంలో న్యాయ విజ్ఞాన సదస్సు
మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి భరత్ కమల్ విచ్చేసి పలు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పీవీ రమణయ్య, అశోక్ కాంబ్లే, డాక్టర్ దీప్తి ఆసుపత్రి సిబ్బంది, రోగులు, పోలీసులు, లోక్ అదాలత్ సిబ్బంది మదన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్