ముంపు ప్రాంతాల్లో మంత్రితో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే ఇంటూరి
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. వరదల కారణంగా పాక్షికంగా పూర్తిగా నష్టపోయిన వారి వివరాలను వెంటనే గుర్తించాలని సచివాలయం సిబ్బంది, వీఆర్వోలు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.