వేదగిరి నరసింహ స్వామికి వైభవంగా తిరుప్పావడ సేవ

62చూసినవారు
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వేంచేసియున్న వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆదివారం స్వాతి నక్షత్రం సంధర్బంగా స్వామివార్లకు అభిషేకం, తిరుప్పావడ సేవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్