పొదుపు లీడర్లను సభ్యులు తొలగించవచ్చు

76చూసినవారు
పొదుపు లీడర్లను సభ్యులు తొలగించవచ్చు
నెల్లూరు జిల్లాలోని బృందావనం వద్ద పొదుపు కార్యాలయంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పొదుపు లీడర్లలో చాలా మంది జమచేయమని సభ్యులు ఇస్తున్న డబ్బులను సరిగ్గా బ్యాంకులో కట్టడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈమేరకు గ్రూపులో 7మంది మెజారిటీ సభ్యుల అభ్యర్థన మేరకు లీడర్లను తొలగించవచ్చని హెచ్చరించారు. తొలగించిన లీడర్లు ఇక మీదట పొదుపులో కొనసాగరని చెప్పారు.

సంబంధిత పోస్ట్