పూతలపట్టు మండలంలోని కమ్మగుట్టపల్లె గ్రామస్థులు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి తిరుమలకు కాలినడకన బుధవారం బయలుదేరి వెళ్లారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు వారివారి మొక్కులు తీరుస్తున్నారు. సీఎంగా చంద్రబాబు, చిత్తూరు ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యేగా కలిగిరి మురళీమోహన్ గెలుపొందిన సందర్భంగా వారు ఈ యాత్ర చేపట్టారు.