పాఠశాలలో చెత్త వేస్తే రూ. 500 జరిమానా

85చూసినవారు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురం మండలం కొత్తపల్లి హరిజనవాడ సమీపంలోని ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ లోపల గ్రామ ప్రజలు చెత్తను వేయకూడదని అధికారులు సోమవారం దండోరా వేయించారు. ఒకవేళ చెత్త వేస్తే జరిమానా గా రూ. 500 చెల్లించాలన్నారు. ఈ విషయాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్