ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

63చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో దేవరాజు గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించి. నాణ్యత బాగుందంటూ మెచ్చుకున్నారు. అనంతరం విద్యార్థులను మధ్యాహ్న భోజన నాణ్యత పై ఆరా తీశారు. పదవ తరగతిలో విద్యార్థుల ప్రశ్నా పత్రాల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఎం జయ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్