కర్రలతో దాడి.. కేసు నమోదు

54చూసినవారు
కర్రలతో దాడి.. కేసు నమోదు
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కారిపాకంలో ఇంట్లో నీళ్లు పడ్డాయని కర్రలతో దాడులు చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హేమలత తన ఇంటి వద్ద నీటితో సామాన్లు కడుగుతుండగా ఆ నీళ్లు ఎదురింటిలో పడ్డాయని శ్రీధర్ గొడవపడ్డాడు. దీంతో శ్రీధర్ భార్య భారతి ఆగ్రహంతో కర్రతో హేమలత తలపై కొట్టింది. హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జున్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్