AP: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రోజూ సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవమూర్తులకు ఇవాళ్టి నుంచి ఐదు రోజులు రాత్రి 7 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందని అన్నారు.