ఏపీ ఎన్నికల్లో గన్నవరం నుంచి బరిలోకి దిగి ఘోర పరాజయం పొందిన వల్లభనేని వంశీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఫలితాల వెల్లడి తర్వాత వంశీ నియోజకవర్గంతో పాటు ఎక్కడా కనిపించకపోవడంపై చర్చ సాగుతోంది. కుటుంబంతో కలిసి వంశీ హైదరాబాద్లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు గన్నవరంలో ఆయన ఆఫీసును కూడా ఖాళీ చేసినట్లు సమాచారం.