లోక్సభ ఎన్నికల నిమిత్తం బీజేపీ పదో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 9 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. అసన్ సోల్ నుంచి అహ్లువాలియాను ఎంపిక చేసింది. అలాగే ఛండీగఢ్ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ను తప్పించి.. ఆ స్థానంలో సంజయ్ టాండన్ను బరిలో నిలిపింది. అలాగే మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్కు యూపీలోని బాలియా నుంచి టికెట్ దక్కింది.