2020లో యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి ఉత్తరాఖండ్లో.. ప్రాణాంతక కోవిడ్-19ను కట్టడి చేసేందుకు కరోలిన్ అనే మందును కనిపెట్టినట్లు ప్రకటించారు. అంతేగాక ఈ మందుతో కరోనా లక్షణాలు దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు. అయితే కొన్ని రోజులకు తాము కరోనా నివారణకు ఎలాంటి మెడిసిన్ తయారు చేయలేదంటూ మాట మార్చారు. దీంతో పతంజలి తీరుపై కేంద్రం సీరియస్ అయి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.