గజపతినగరంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమం

83చూసినవారు
గజపతినగరంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమం
గజపతినగరంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజా పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో గజపతినగరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేశారు. నాలుగు రోడ్ల జంక్షన్ లో ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పిటిసి, ఎంపీడీవో కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్