ఉద్యోగ భద్రత కల్పించాలని ఎక్సైజ్ శాఖ మంత్రికి వినతి...

54చూసినవారు
ఉద్యోగ భద్రత కల్పించాలని ఎక్సైజ్ శాఖ మంత్రికి వినతి...
ఉద్యోగ భద్రత కల్పించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను బేవరేజెస్ యూనియన్ నాయకులు కలిశారు. విజయవాడలో మంత్రి నివాసంలో శుక్రవారం సాయంత్రం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరావు, ఉపాధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక మద్యం దుకాణాల సిబ్బంది కలిసి ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేటీకరణ చేస్తే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దీనిపై మంత్రి రవీంద్ర సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్