పుణేలో కారుతో ఢీకొట్టి ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న నిందితుడి(17) తండ్రి విశాల్ అగర్వాల్కు అక్కడి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 19న మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపిన ఆ బాలుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతికి కారణమయ్యాడు. కాగా తమ కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు బ్లడ్ శాంపిల్స్ మార్చారనే కారణంతో తండ్రి విశాల్ అగర్వాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.