మొక్కల నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ కోట పంచాయతీ సర్పంచ్ సంతోషి కుమారి పిలుపునిచ్చారు. ఎస్సీ కాలనీ స్మశాన వాటికలో ఆమె భర్త ప్రముఖ టిడిపి నాయకులు సతీష్ కుమార్ తో కలసి జియో స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకులు బి రామకృష్ణ, విజయలక్ష్మి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో లాస్య శ్రీ, హృషికేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.