రాష్ట్ర టిడిపి అధ్యక్షులుగా నియామకమైన పల్లా శ్రీనివాసరావును ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి మంగళవారం విశాఖలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్ తో కలసి శ్రీనివాసరావుకు పుష్పగుచ్చం ఇచ్చి తమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్. కోట నియోజకవర్గ టిడిపి నాయకులు పాల్గొన్నారు.