సేవకు మారుపేరు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్

72చూసినవారు
సేవకు మారుపేరు శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బుధవారం ఆయన కొత్తవలస మండలం మంగళ పాలెం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ లో వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తో కలసి పాల్గొన్నారు. అనంతరం వికలాంగులకు కృత్రిమ అవయువాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు సేవలు అభినందనీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్