ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేలా సహకరించాలి: ఎస్సై

59చూసినవారు
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేలా సహకరించాలి: ఎస్సై
గజపతినగరం పోలీసు స్టేషను కొత్త బగ్గాం గ్రామంలో స్థానికులకు ఎస్సై యు. మహేష్, సిబ్బందితో రానున్న ఎన్నికల పై అవగాహన కార్యక్రమం బుధవారం రాత్రి 8 గంటలకు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేలా సిబ్బందికి సహకరించాలని గ్రామస్తులను కోరారు. తగాదాలు జోలికి వెళ్ళద్దని, బైండోవర్ కేసులు చేసినందున అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలపై, సొంతింటి పై జెండాలు కట్టాలన్న ఆర్వో అనుమతి పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్