రామభద్రపురంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో స్థానిక జెడ్పీ హైస్కూల్లో 270 మందికి 269 మంది హాజరయ్యారు. ఒకరు గైర్హాజరయ్యారు. గ్లోబల్ వ్యూ స్కూల్లో 241 మందికి 238 మంది హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు, తహశీల్దార్ సులోచనారాణి, ఎంపీడీఓ రత్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.