బైకును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఒకరు మృతి

3269చూసినవారు
జియ్యమ్మవలస మండలం వెంకటాపురం మలుపు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు బిజెపురం గ్రామానికి చెందిన డప్పు రాజుగా గుర్తించారు. పెళ్లి ఈడు ఇవ్వడానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్