మన్యం జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు గిరిజన విద్యార్థులు మృతి చెందారని ఈపాపం ప్రభుత్వానిదేనని పాలక రంజిత్ కుమార్ అన్నారు. ఈమేరకు విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని బుధవారం డిమాండ్ చేసారు. మంగళవారం కొమరాడలో కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కడ్రక శారద, బుధవారం పి. ఆమిటి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మల అవంతి డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.