ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ

52చూసినవారు
ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ
గరుగుబిల్లి మండలంలోని నాగూరులో ఆరోగ్య సురక్ష శిబిరాన్ని డీఎంహెచ్ఓ బి. జగన్నాథరావు శనివారం సందర్శించారు. శిబిరంలో అందిస్తున్న ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. వ్యాధి లక్షణాల గుర్తింపు, రోగ నివారణ జాగ్రత్తలపై ఎల్ఈడీ ప్రచారం లేకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా శిబిరాలు నిర్వహించొద్దని హెచ్చరించారు. రావివలస పీహెచ్సీ వైద్యురాలు కీర్తి, ఎంపీడీవో పైడితల్లి తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్