ప్రతీఒక్కరూ ఓటు విలువను తెలుసుకొని, రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఓటు వేయడానికి వీలుగా విభిన్న ప్రతిభావంతులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మొసానిక్ లాడ్జ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు విభిన్న ప్రతిభావంతుల ర్యాలీ శనివారం నిర్వహించారు.