ద్విచక్ర వాహన చోదకులు తప్పని సరిగా హెల్మెల్ ధరించాలని మన్యం జిల్లా రవాణాధికారి యం. శశి కుమార్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై రహదారి భద్రత అవగాహనా కార్యక్రమాన్ని మంగళవారం పార్వతీపురం ప్రజా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు హెల్మట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నా చాలామంది విద్యా వంతులు కూడా హెల్మట్ ధరించ కపోవటం బాధాకరమన్నారు.