పార్వతీపురం పట్టణంలో లార్వా నిరోధక రసాయనాల పిచికారి

72చూసినవారు
పార్వతీపురం పట్టణంలో లార్వా నిరోధక రసాయనాల పిచికారి
పార్వతీపురం పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ ను జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డాక్టర్ టి. జగన్ మోహనరావు మున్సిపల్ కమిషనర్ కె. శ్రీనివాసరావు పర్యవేక్షణ చేశారు. జగన్నాధపురంలో 29, 30వార్డులలో గురువారం చేపట్టిన కాలువల్లో పూడిక తీత, దోమల లార్వా నివారణ పిచికారీ(ఏఎల్ఓ) కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. దోమలు వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక రసాయనాలను పిచికారి చేయించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్