శ్రీకాకుళం పార్లమెంటు తెదేపా అధ్యక్షునిగా కలమట వెంకట రమణ నియమితులయ్యారు. టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన విడుదలైంది. ఈయన జడ్పిటిసిగా, పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం తెదేపా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పాతపట్నం అసెంబ్లీ టికెట్ ఆశించారు. సర్వే మామిడి గోవిందరావు అభ్యర్థత్వంపై మొగ్గు చూపడంతో టికెట్ రాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.