రామోజీరావు తెలుగువారి ఆత్మబంధువు అని వాజీ చానల్ ఎండీ గణపతినీడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం వాజీ చానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు సంస్మరణ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ అక్షరసూరీడు అస్తమించినా ఆ వెలుగులు శాశ్వతమని, ఆయన కీర్తి ఆచంద్రతారార్కమని అన్నారు. పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ ఆస్మా ఫర్హీన్ మాట్లాడుతూ రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభివర్ణించారు.