శ్రీ చక్ర మేరువుల దేవి ఆశ్రమంలో దొంగతనం

4417చూసినవారు
సహస్ర శ్రీచక్రమేరువుల దేవీ ఆశ్రమంలో మంగళవారం రాత్రి దొంగలు పడి అమ్మవారి నగలు, వెండి కిరీటం దోచుకొని వెళ్లారు. దొంగలు షిర్డీ సాయిబాబా మందిరం పక్కనే ఉన్న గ్రిల్స్ నుండి అమ్మవారి ఆలయంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. కుంచాల కుర్మయ్యపేటలో ఈఆశ్రమం ఉంది. నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం వివరాలను సేకరిస్తున్నారు. అమ్మవారి వెండి కిరీటం, బంగారు ఆభరణాలు, భక్తులు ఇచ్చిన నగదు పోయినట్లు తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్