కుక్కల దాడిలో గాయపడ్డ గేదె పెయ్య

82చూసినవారు
కుక్కల దాడిలో గాయపడ్డ గేదె పెయ్య
కుక్కల దాడిలో గేదెపెయ్య గాయపడిన ఘటన వేపాడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. దువ్వాడ ఈశ్వరరావుకు చెందిన గేదె పెయ్య ను తన కలంలో కట్టి ఉంచాడు. సాయంత్రం సమయంలో వీధి కుక్కలు గేదె పెయ్యపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఈశ్వరరావు కల్లంకు వెళ్లి గేదె పెయ్యకు సపర్యలు చేశాడు. వీధి కుక్కల స్వైర విహారం ఎక్కువైందని, నిర్మూలనకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్