చురుగ్గా సాగుతున్న ఉపాధి హామీ పనులు

81చూసినవారు
ఎస్ కోట మండలం వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం వినాయకపల్లిలో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణమ్మ ఉపాధి హామీ కూలీలతో పనులు ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల మేర ఉపాధి కూలీలు ఎండల దృష్ట్యా సమయపాలన పాటిస్తూ, కొలతల మేర పని చేయాలని ఆమె కోరారు. వాతావరణం చల్లగా ఉన్న నేపథ్యంలో ఉపాధి కూలీలు కాస్త ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్