ఎస్ కోట మండలం వినాయకపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీవో తిరుపతిరావు మంగళవారం పరిశీలించారు. ముందుగా ఆయన ఉపాధి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీల హాజరు పట్టిని, జాబ్ కార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి పనులపై ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణమ్మకు పలు సూచనలు, సలహాలు చేశారు. వేతనదారులు సమయపాలన పాటించి, కొలతల ప్రకారం పని చేయాలని తెలిపారు.