ఎల్ కోట: ప్రజా సంక్షేమం, కార్యకర్తల క్షేమమే టిడిపి లక్ష్యం

80చూసినవారు
ఎల్ కోట: ప్రజా సంక్షేమం, కార్యకర్తల క్షేమమే టిడిపి లక్ష్యం
ప్రజా సంక్షేమం, కార్యకర్తల క్షేమమే టిడిపి లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన టిడిపి సభ్యత్వ నమోదు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 26 నుండి ప్రారంభం కానున్న టిడిపి సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. నియోజకవర్గంలో టిడిపి బలమైన శక్తిగా ఎదిగేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఏపీ టూరిజం బోర్డ్ మెంబర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్