రెండు లక్షల జీవనజ్యోతి బీమా చెక్కు అందజేత

81చూసినవారు
రెండు లక్షల జీవనజ్యోతి బీమా చెక్కు అందజేత
వేపాడ మండలం బల్లంకి గ్రామానికి చెందిన గళ్ళ కాసులమ్మ ఇటీవల మృతి చెందింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం కింద మృతురాలి కుటుంబ సభ్యులకు స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ జగన్మోహన్ 2 లక్షల రూపాయల బీమా చెక్కును మంగళవారం అందజేశారు. మృతురాలు ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకానికి బీమా కట్టడంతో మృతురాలి కుటుంబ సభ్యులకు భీమా చెక్కు అందజేయడం జరిగిందని మేనేజర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్