స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై వైసిపి అనర్హత వేటు వేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో ఉంటూ టిడిపి అభ్యర్థులకు సహకరించారని ఆరోపణలతో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ శాసనమండలిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్ మోషేన్ రాజు సోమవారం చర్యలు తీసుకున్నారు. వివరణ ఇవ్వాలని 3సార్లు పిలిచినా స్పందించకపోవడంతో సస్పెన్షన్ వేటు వేస్తూ సోమవారం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.