టీడీపీ రెబెల్ అభ్యర్థిగా గీత నామినేషన్

5137చూసినవారు
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ రెబెల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత శుక్రవారం నామినేషన్ వేశారు. తహసీల్దార్ కార్యాలయంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ కు ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఆత్మగౌరవం నినాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని తెలిపారు. ప్రజలందరూ తనని ఆశీర్వాదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్