నేటి నుంచి స్టీల్ ప్లాంట్లో ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు

50చూసినవారు
నేటి నుంచి స్టీల్ ప్లాంట్లో ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఏఐటియుసి జాతీయ సమితి సమావేశాలకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్, జాతీయ అధ్యక్షుడు రామేంద్ర కుమార్, ఉపాధ్యక్షులు విద్యాసాగర్ గిరి హాజరుకానున్నారు. మూడు రోజులు పాటు సమావేశాలు జరుగుతాయని స్థానిక ఏఐటియుసి ప్రతినిధులు శనివారం తెలిపారు. కార్మికుల ఉద్యోగుల హక్కుల పరిరక్షణ చేపట్టాల్సిన ఉద్యమాలపై తీర్మానాలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్