ఉత్తమ నియోజక వర్గంగా దక్షిణం

59చూసినవారు
జనసేన పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకుడు, 32వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం అల్లిపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వంశీ కృష్ణ కు వెండి కిరీటం, రుద్రాక్షలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కందుల నాగరాజుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్