ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల

68చూసినవారు
నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్ గేట్లను గురువారం ఏపీ స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ చేతులు మీదుగా ఎత్తి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావణపల్లి రిజర్వాయర్ ఆయకట్టు కింద సుమారు 3, 000 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేస్తున్నారని వివరించారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 358 క్యూబిక్ మీటర్ల కాగా, ప్రస్తుతం 215 క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్