ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి

57చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం  కార్యక్రమంలో మాజీ మంత్రి
జీ. మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ కేంద్రంలో శుక్రవారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా.. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణి కుమారి పాల్గొన్నారు. వైసీపీ పాలనలో తీసుకోలేని చారిత్రాత్మక నిర్ణయాలను ఎన్డీ.ఏ కూటమి 100 రోజుల పాలనలో తీసుకోవడం స్వర్ణ యుగం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నియోజకవర్గ జీ.మాడుగుల మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్