కిడ్నీ బాధిత గ్రామాలలో మినరల్ ప్లాంట్

74చూసినవారు
కిడ్నీ బాధిత గ్రామాలలో మినరల్ ప్లాంట్
కిడ్నీ బాధిత గ్రామాలను ఆదుకొనేందుకు తగు చర్యలు చేపట్టనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ తెలిపారు. కొయ్యూరు మండలంలోని ఆడాకుల పంచాయతీలో కిడ్నీ బాధిత గ్రామాలను ఆదుకోవాలని ఇటీవల బీజేపీ మండల అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐటిడిఏ పిఓ అభిషేక్ లకు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన పివో శనివారం మండల పర్యటనలో భాగంగా కిడ్నీ బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్