పాడేరు నియోజకవర్గంలో 1967 నుంచి 2019 వరకు మొత్తం 12సార్లు
ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 5సార్లు
కాంగ్రెస్, 3 సార్లు
టీడీపీ, 2 సార్లు
వైసీపీ, ఒకసారి జనత పార్టీ, బీఎస్పీలు విజయం సాధించాయి. పాడేరు నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో
వైసీపీ నుంచి మత్స్యరస విశ్వేశ్వరరాజు,
టీడీపీ నుంచి గిడ్డి ఈశ్వరీలు పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పాడేరు గెలుపు గుర్రం ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.