రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామానికి చెందిన అడ్వకేట్ లక్ష్మీ ప్రసన్న రంపచోడవరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారని గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చిన గిరిజనులను అభివృద్ధి చేయలేదని అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు.